టాలీవుడ్లో ఎవరి నోట విన్నా 'రుద్రమదేవి'
మాటే. గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్
నాలుగో తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో
'రుద్రమదేవి' పాత్రలో అనుష్క అలరించనుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్గా
గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు'ను తెరకెక్కించనున్నాడనే వార్త కొన్ని రోజులుగా
టాలీవుడ్లో హల్చెల్ చేస్తోంది. ఆ చిత్రంలో టైటిల్ రోల్ని అల్లు అర్జున్
చేస్తాడనే మాట వినిపించింది. అయితే తాజాగా ఆ పాత్రని ప్రిన్స్ మహేష్ బాబు
చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే 'రుద్రమదేవి'లో గోన గన్నారెడ్డి
అనే పవర్ ఫుల్ పాత్రని అల్లు అర్జున్ చేయడంతోనే, 'ప్రతాపరుద్రుడు'గా మహేష్
చేయవచ్చని టాక్. ఈ సినిమా చరిత్రకు వస్తే 'రుద్రమదేవి', చాళుక్య
వీరభద్రుడికి ముమ్ముడమ్మ - రుయ్యమ్మ అని ఇద్దరు కుమార్తెలు. వీరిలో
ముమ్ముడమ్మ- మహాదేవుడుకి 'ప్రతాపరుద్రుడు' జన్మించాడు. అతనే రుద్రమదేవికి
దత్తపుత్రుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
ఈ స్టోరీ ప్రకారం చూస్తే 'రుద్రమదేవి'గా
అనుష్క అయితే, ఆమె దత్తపుత్రుడుగా మహేష్ వస్తాడన్నమాట. మరి పౌరుష
ప్రతాపాలకు ప్రతీకగా కనిపించే ఈ పాత్ర చేయడానికి మహేష్ అంగీకరిస్తాడో లేదో
తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment